అమరావతిలో అలజడి...దళిత రైతు‌పై కత్తులతో దాడి

ABN , First Publish Date - 2021-09-19T01:14:07+05:30 IST

అమరావతిలో అలజడి...దళిత రైతు‌పై కత్తులతో దాడి

అమరావతిలో అలజడి...దళిత రైతు‌పై కత్తులతో దాడి

గుంటూరు: ఏపీ రాజధాని అమరావతిలో అలజడి రేగింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఉద్ధండరాయునిపాలెంకు చెందిన దళిత రైతుపై కొందరు వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉద్ధండరాయుడి పాలెంలో దీక్షా శిబిరంలో ఉన్న పులి చిన్నా అనే దళిత రైతు వద్దకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు కత్తితో దాడికి దిగారు. ఈ పరిణామంతో స్థానికుల వెంటనే మేల్కొని దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై రాజధాని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేశ్ మనుషులను అడ్డుకున్నామన్న కారణంతోనే వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మనుషులు తనపై దాడి చేశారని బాధిత రైతు పులి చిన్నా చెబుతున్నారు. 



Updated Date - 2021-09-19T01:14:07+05:30 IST