ఆంధ్రుల కీర్తికి ప్రతీక అమరావతి
ABN , First Publish Date - 2021-04-21T09:56:07+05:30 IST
ఐదు కోట్ల మంది ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలను నలు దిశాలా చాటేది అమరావతి రాజధానేనని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావ తి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళన లు మంగళవారంతో 490వ రోజుకు చేరుకున్నాయి.
- -490వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు
తుళ్లూరు, ఏప్రిల్ 20: ఐదు కోట్ల మంది ఆంధ్రుల కీర్తి ప్రతిష్టలను నలు దిశాలా చాటేది అమరావతి రాజధానేనని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావ తి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళన లు మంగళవారంతో 490వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు, రైతులు మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా చేసుకుని పాలన సాగించిన రాజావాసిరెడ్డి వెంకట్రాది నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా ఆయనను రైతు శిబిరాలలో స్మరించుకున్నారు. ‘అమ్మను మరువలేం, అమరావతిని మరువలేం‘.. అంటూ నినాదాలు చేశారు. భూములు ఇస్తే అన్నదాతను రోడ్డున పడేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్ర ప్రయోజనాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలుంటే అమరావతిపై చూపిస్తారా అని మండిపడ్డారు.