రాజధానిపై సీఎం జగన్ మాటతప్పారు: అమరావతి జేఏసీ
ABN , First Publish Date - 2020-07-02T17:18:36+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటతప్పారని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటతప్పారని అమరావతి పరిరక్షణ సమితి (జేఏసీ) నేతలు విమర్శించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో రాజధాని అమరావతి కోసం రైతులు వారి ఇళ్లల్లోనే దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయడానికి ముందుకు వచ్చారని అన్నారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందని విమర్శించారు. అమరావతిలో భవనాలు కూడా అమ్ముతారని ప్రకటనలు వచ్చాయని.. అంటే ప్రభుత్వం ప్రజల ఆస్తులను అమ్ముకుంటూ పోవడమేనా? అని ప్రశ్నించారు. రేపు సచివాలయం కూడా అమ్మరని గ్యారంటీ ఉందా? అని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఆరాచక చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండిచాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. కాగా తమకు న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని రైతులు స్పష్టం చేశారు.