మహాపాదయాత్రను దిగ్విజయం చేయాలి
ABN , First Publish Date - 2021-10-20T05:45:38+05:30 IST
అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు నవంబరు ఒకటి నుంచి జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు పిలుపునిచ్చారు.
రాజధాని రైతులు, మహిళల పిలుపు
తుళ్ళూరు, అక్టోబరు 19: అమరావతిలోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి తిరుపతి వరకు నవంబరు ఒకటి నుంచి జరిగే పాదయాత్రను జయప్రదం చేయాలని రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం మందడంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 రోజుల పాటు సాగే మహా పాద యాత్రను దిగ్విజయం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరారు.