మూడు రాజధానులని ముంచొద్దు

ABN , First Publish Date - 2020-09-16T13:34:29+05:30 IST

అమరావతి కోసం భూములు త్యాగం చేస్తే.. ప్రస్తుత పాలకులు మూడు రాజధానులని..

మూడు రాజధానులని ముంచొద్దు

అమరావతి లేకుండా చేస్తే రాష్ట్రం అనాథే 

273వ రోజు ఆందోళనల్లో రైతులు, మహిళల ఆవేదన 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): అమరావతి కోసం భూములు త్యాగం చేస్తే.. ప్రస్తుత పాలకులు మూడు రాజధానులని ముంచుతున్నారని రైతులు, మహిళ లు వాపోయారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తో న్న ఉద్యమం మంగళవారానికి 273వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానులు అంటూ నడివీధిలో నిలబెట్టి ఆనందిస్తున్నారంటూ పాలకులపై రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉసురు తగిలి అనుభవిస్తారని మండిపడ్డారు. ఉద్ధండ్రాయునిపాలెం దీక్షా శిబిరం వద్ద మహిళలు, రైతులు మోకాళ్ల మీద నిల్చొని నిరసన తెలిపారు. అమరావతి అభివృద్ధి కొనసాగాలని తుళ్లూరులో మహిళలు హనుమాన్‌చాలీసా పఠించి,  పూజ లు చేశారు. అనంతవరం, నేలపాడు, వెలగపూడి, మందండం, ఐనవోలు గ్రామాలలో దీక్షలు కొనసాగించారు.  

  అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని తాడేపల్లి మండలం పెనుమాకలో నిరసన దీక్షలు కొనసాగా యి. రైతులు, రైతు కూలీలు ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు మనజాలవన్నారు. దీక్షలో కళ్లం రాజశేఖర్‌రెడ్డి, దండమూడి శ్రీహరి, ము ప్పెర సదాశివరావు, పలగాని సాం బశివరావు, ఎం తాతయ్య, సాబ్‌జాన్‌, మన్నవ వెంకటేశ్వరరావు, కళ్లం రామిరెడ్డి, గోగినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

  మూడు రాజధానులకు వ్యతిరే కంగా తాడికొండ మండలం పొన్నె కల్లు, మోతడక గ్రామాలలో రైతు లు, మహిళలు మంగళవారం నిరస నలు కొనసాగించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాజ ధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్ప డిన వారిని అరెస్టు చేసి అమరా వతిని కొనసాగించాలన్నారు.  

Updated Date - 2020-09-16T13:34:29+05:30 IST