అర్చకులకు 5వేల సాయం: వెలంపల్లి

ABN , First Publish Date - 2020-04-09T09:29:17+05:30 IST

అర్చకులకు 5వేల సాయం: వెలంపల్లి

అర్చకులకు 5వేల సాయం: వెలంపల్లి

అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చిన్న ఆలయాల అర్చకులకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. కరోనా వల్ల భక్తులను అనుమతించకపోవడంతో ఆదాయం లేని ఆలయాల్లోని అర్చకులకు ఇబ్బందిగా మారినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ధూప దీప నైవేద్యం, అర్చక సంక్షేమ నిధి కింద 2,800 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతోందని, ఈ రెండు పథకాల్లో లేని మరో 2,500 మంది అర్చకులకుఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. దీనివల్ల ఖజానాపై రూ.1.25 కోట్ల భారం పడుతున్నప్పటికీ, అర్చకులను ఆదుకోవాలని సీఎం జగన్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిపై అర్చక సంక్షేమ సమాఖ్య ప్రతినిధులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు హర్షం వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-04-09T09:29:17+05:30 IST