ఉద్దండరాయునిపాలెం వద్ద రైతుల శ్రమదానం..అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2020-10-21T17:48:40+05:30 IST

రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం వద్ద శ్రమదానంతో రైతులు శుభ్రం చేస్తున్నారు.

ఉద్దండరాయునిపాలెం వద్ద రైతుల శ్రమదానం..అడ్డుకున్న పోలీసులు

అమరావతి: రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన ప్రదేశం ఉద్దండరాయునిపాలెం వద్ద శ్రమదానంతో రైతులు శుభ్రం చేస్తున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసి రేపటికి 5 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో రేపు శంకుస్థాపన ప్రాంతం వద్ద రైతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శ్రమదానం చేసి ఆ ప్రాంతాన్ని రైతులు శుభ్రం చేస్తున్నారు. కాగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాజధాని రైతులు భారీగా చేరుకుంటున్నారు. 



 

Updated Date - 2020-10-21T17:48:40+05:30 IST