కంచిబొట్ల బ్రహ్మకు ప్రధాని, సీఎం నివాళి
ABN , First Publish Date - 2020-04-09T09:42:19+05:30 IST
కంచిబొట్ల బ్రహ్మకు ప్రధాని, సీఎం నివాళి
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయ రంగానికి కంచిబొట్ల బ్రహ్మానందం ఉత్తమ సేవలను అందించారని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలోని న్యూయార్క్లో కరోనాబారిన పడి బ్రహ్మానందం మృతి చెందడం తీవ్రంగా బాధించిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతిని తెలుపుతూ.. ‘ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. బ్రహ్మానందం మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ప్రకటనలో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బ్రహ్మానందాన్ని ఇంత త్వరగా కోల్పోతామనుకోలేదని ఇండియన్ పయనీర్ సంపాదకుడు ఇంద్రజిత్ ఎస్. సలూజా అన్నారు. హైదరాబాద్తో తమకున్న ఉమ్మడి అనుబంధాన్ని పంచుకొనేవారమని భారత సంతతి అమెరికా ఫొటోగ్రాఫర్ మొహమ్మద్ జాఫర్ గుర్తు చేసుకొన్నారు.