రైతులకు బేడీలు వేయడం తప్పే: ఎంపీ నందిగం సురేశ్

ABN , First Publish Date - 2020-10-30T19:09:19+05:30 IST

రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు బేడీలు వేయడం తప్పే: ఎంపీ నందిగం సురేశ్

అమరావతి: రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికీ తప్పేనని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఒక్కటేనని.. చంద్రబాబు మాయలో పడొద్దుని వ్యాఖ్యానించారు. దళితుల జీవితాలతో టీడీపీ నేతలు ఆడుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బేడీలు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రైతులకు బేడీలు వేయడం రాజకీయంగా తీవ్ర దుమారాన్నే లేపింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది వైసీపీ సర్కార్. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2020-10-30T19:09:19+05:30 IST