ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

ABN , First Publish Date - 2021-03-02T06:07:38+05:30 IST

మండలంలోని వైకుంఠపురం గ్రామంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

 అమరావతి, మార్చి 1: మండలంలోని వైకుంఠపురం గ్రామంలో ఆదివారం ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల కఽథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోట ప్రవీణ్‌కుమార్‌ కుమారుడు వెంకటనాగసాయి(14), పి.వెంకటేశ్వరరావు కుమారుడు గోవర్ధన్‌(9) సెలవు దినం కావడంతో ఉదయం 9గంటల నుంచి తోటి స్నేహితులతో కలసి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, ప్రాథమికోన్నత పాఠశాల పరిసరాలలో మధ్యాహ్నం 2గంటల వరకు ఆడుకున్నారు. మిగిలివారు ఇంటికి చేరగా వారిద్దరు కనిపించలేదు. సోమవారం కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ విజయకృష్ణ, ఎస్‌ఐ కోటేశ్వరరావు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-03-02T06:07:38+05:30 IST