కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఆప్ సస్పెండెడ్ ఎమ్మెల్యేలు
ABN , First Publish Date - 2021-06-03T23:12:38+05:30 IST
ఆమ్ఆద్మీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వారిని కాంగ్రెస్లో ఆహ్వానించగా, అధ్యక్షురాలు సోనియా గాంధీ వీరి రాకకు ఆమోద ముద్ర వేశారు. సుఖ్పాల్ సింగ్ ఖైరా, జగదేవ్ సింగ్ కమాలు, పీర్మల్ సింగ్ ధవులా అనే నేతలు కాంగ్రెస్లో చేరారు. ఈ ముగ్గురితో ఉన్న ఫొటోను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.