అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-04-21T02:51:45+05:30 IST

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విలయతాండం చేస్తోంది. కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఢిల్లీలో నాన్-ఎసెన్షియల్ డెలివరీలను నిలిపివేసినట్లు పేర్కొన్నాయి. ఈ మార్పు గురించి అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు సమాచారం ఇచ్చాయి. ఇంతకుముందు కంపెనీలు మహారాష్ట్రలో ఇలాంటి చర్య తీసుకోవలసి వచ్చిందని పేర్కొంది. ఢిల్లీలో ఏప్రిల్ 26 సోమవారం వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. 

Updated Date - 2021-04-21T02:51:45+05:30 IST