‘ఓటీఎస్‌ విధానం రద్దు చేయాలి’

ABN , First Publish Date - 2021-12-07T05:58:44+05:30 IST

ఓటీఎస్‌ విధానం రద్దు చేయాలని అధికారులను, ప్రభుత్వ నాయకులను వేడుకొంటున్నా పట్టించుకోకపోవడంపై వారికి కనువిప్పు కలగాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వర్ధంతి రోజున పాలకోడేరు టీడీపీ నాయకులు వినూత్న రీతిలో వినతిపత్రం అందించి నివాళులర్పించారు.

‘ఓటీఎస్‌ విధానం రద్దు చేయాలి’
వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు

పాలకోడేరు, డిసెంబరు 6 : ఓటీఎస్‌ విధానం రద్దు చేయాలని అధికారులను, ప్రభుత్వ నాయకులను వేడుకొంటున్నా పట్టించుకోకపోవడంపై వారికి కనువిప్పు కలగాలని అంబేడ్కర్‌ విగ్రహానికి వర్ధంతి రోజున పాలకోడేరు టీడీపీ నాయకులు వినూత్న రీతిలో వినతిపత్రం అందించి నివాళులర్పించారు. ఇప్పటికైనా వైసీపీ నాయ కుల పద్దతి మార్చుకోవాలని టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు కోరారు. పాలకోడేరు టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు డి.కృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఆర్‌.శ్రీను, పార్టీ గ్రామ అధ్యక్షుడు జీవీ సత్యనారాయణ, కె.సత్యనారాయణ, ఈ.సత్యనారాయణ, లెనిన్‌బాబు, నతానియేలు, బంగారయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:58:44+05:30 IST