పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి

ABN , First Publish Date - 2020-10-25T11:11:31+05:30 IST

పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలియో నిర్మూలన చైర్మన్‌ అంబికా రాజా పిలుపునిచ్చారు.

పోలియో రహిత సమాజ స్థాపనకు కృషి

ఏలూరు కల్చరల్‌, అక్టోబరు 24 : పోలియో రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలియో నిర్మూలన చైర్మన్‌ అంబికా రాజా పిలుపునిచ్చారు. ఏలూరు రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో పోలియో నిర్మూ లనకు పోలియో ఫండ్‌ సేకరణలో భాగంగా శనివారం సాయంత్రం స్థాని కంగా సమావేశం జరిగింది. క్లబ్‌ చైౖర్మన్‌ డాక్టర్‌ రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజా మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో తమ వంతు భాగంగా మూడు లక్షల విరాళం సేకరించి  అందజేస్తామన్నారు. ఇప్పటికే పోలియో నిధి కోసం నగరంలోని వివిధ షాపుల్లోనూ షాపింగ్‌ మాల్స్‌లో పల్స్‌పోలియో నిధి బాక్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలి పారు. సెక్రటరీ కె.నాగేశ్వరరావు, ట్రెజరర్‌ కృష్ణభాస్కర్‌, సీహెచ్‌ నాగ భూషణరావు, పీఎన్‌ రామ్మోహనరావు, కె.లక్ష్మీ అప్పారావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-25T11:11:31+05:30 IST