భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించిన హాలీవుడ్ యాక్టర్!
ABN , First Publish Date - 2020-08-15T23:39:44+05:30 IST
ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ మేరీ మిల్బెన్.. సోషల్ మీడియా వేదికగా భారతీలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందే
వాషింగ్టన్: ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ మేరీ మిల్బెన్.. సోషల్ మీడియా వేదికగా భారతీలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో.. ‘ఈ రోజు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్-అమెరికన్లకు, భారతీయులకు ఇది ముఖ్యమైన రోజు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూకి భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె.. భారతదేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. మేరీ మిల్బెన్.. గత కొద్ది కాలంగా భారత్కు చెందిన ఉపాధ్యాయుడి వద్ద హిందీ నేర్చుకుంటున్నారు.