అమేయకు బాల పురస్కార్-2021
ABN , First Publish Date - 2021-01-26T09:04:37+05:30 IST
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2021కు ఎంపికైన చిన్నారులను ఉద్దేశించి సోమవారం ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మాట్లాడారు.
విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు-2021కు ఎంపికైన చిన్నారులను ఉద్దేశించి సోమవారం ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో మాట్లాడారు. తెలుగు రాష్ర్టాలకు సంబంధించి కళలు(భరతనాట్యం)విభాగంలో విశాఖకు చెందిన అమేయ లగుడు(11), వెబ్డెవలపర్గా, ఆవిష్కర్తగా రాణిస్తున్న హైదరాబాద్కు చెందిన హేమేశ్ చదలవాడ(14) ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. విశాఖ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో.. అమేయతోపాటు జాయింట్ కలెక్టర్ పి.అరుణ్బాబు, ఐసీడీఎస్ పీడీ సీతామహాలక్ష్మి, అవార్డు గ్రహీ త తల్లిదండ్రులు కమల, త్రిమూర్తులు పాల్గొన్నారు.