తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా

ABN , First Publish Date - 2020-12-05T02:21:58+05:30 IST

జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో ట్వీట్ చేసిన ఆయన..

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కేంద్ర  హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో ట్వీట్ చేసిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో,అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.  కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు.



Updated Date - 2020-12-05T02:21:58+05:30 IST