అమ్మా మేమూ వచ్చేస్తున్నాం

ABN , First Publish Date - 2022-06-23T08:36:51+05:30 IST

అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లి అనారోగ్యంతో చనిపోతే తట్టుకోలేకపోయారా అన్నదమ్ములు! తండ్రి కూడా మరో పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్లిపోవడంతో మరింత కుమిలిపోయారు.

అమ్మా మేమూ వచ్చేస్తున్నాం

తల్లి చనిపోయిందన్న బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య

కీసర రూరల్‌, జూన్‌ 22: అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లి అనారోగ్యంతో చనిపోతే తట్టుకోలేకపోయారా అన్నదమ్ములు! తండ్రి కూడా మరో పెళ్లి చేసుకుని వేరే ఊరు వెళ్లిపోవడంతో మరింత కుమిలిపోయారు. తల్లిదండ్రులిద్దరి ప్రేమకూ దూరమయ్యామని కుంగిపోయారు!! ఏడెనిమిది నెలలపాటు ఆ ఆవేదనతోనే కాలంగడిపారు. ఆ బాధను మరింతకాలం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధి రాంపల్లి దాయరలో చోటుచేసుకుందీ విషాదం. ఆ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివా్‌సరెడ్డి, ప్రమీల దంపతులకు మాధవరెడ్డి, యాదిరెడి,డమహిపాల్‌రెడ్డి సంతానం. వీరిలో యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పియానో టీచర్లుగా ఉద్యోగం చేస్తూ హైటెక్‌ సిటీ వద్ద ఉంటున్నారు. వారంలో రెండు రోజులు ఇద్దరూ రాంపల్లి దాయరకు వచ్చి, వెళ్తుండేవారు. వీరి తల్లి ప్రమీల క్యాన్సర్‌ బారిన పడి ఎనిమిది నెలల క్రితం చనిపోయారు.


 తండ్రి మరో వివాహం చేసుకొని వేరే ఊరికి వెళ్లిపోయారు. దీంతో.. తల్లిదండ్రులిద్దరి ప్రేమనూ కోల్పోయామంటూ యాదిరెడ్డి(34), మహిపాల్‌రెడ్డి(29) బాధపడేవారు. ఈ క్రమంలోనే వారు మంగళవారంనాడు రాంపల్లి దాయరలోని తమ నివాసానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు గ్రామంలోని స్నేహితులతో, బంధువులతో, చుట్టుపక్కల వారితో మాట్లాడారు. ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లిపోయారు. వారి అన్న మాధవరెడ్డి.. ఇద్దరికీ ఎన్నిసార్లు ఫోన్‌  చేసినా కలవకపోవడంతో ఆయన గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధికి ఫోన్‌ చేశాడు. ఆయన వారి ఇంటికి వెళ్లి చూడగా హాల్‌లో యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. బెడ్‌రూంలో మహిపాల్‌ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘మా చావుకి ఎవరూ కారణం కాదు.. తల్లిప్రేమ దూరం కావడంతో మనస్తాపానికి, ఆవేదనకు గురై మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం’’ అని రాసిన సూసైడ్‌నోట్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-06-23T08:36:51+05:30 IST