కామాక్షితాయికి లక్ష కుంకుమార్చన
ABN , First Publish Date - 2021-04-20T03:25:41+05:30 IST
మండలంలోని జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయికి సోమవారం వైభవంగా లక్షకుంకుమార్చన జరిగింది. ఆలయంలో ప్రత్యేకం
బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్19: మండలంలోని జొన్నవాడ ఆలయంలో కామాక్షితాయికి సోమవారం వైభవంగా లక్షకుంకుమార్చన జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా కొలువుదీర్చిన కామాక్షితాయి ఉత్సవమూర్తికి 20మందికి పైగా అర్చకులు లలితా సహస్ర నామార్చనతో నిర్వహించిన ఈ లక్షకుంకుమార్చనలో భక్తులంతా పాల్గొన్నారు. కార్యక్రమానికి నాగాయగుంటకు చెందిన వీ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.