అమ్మోనియం నైట్రేట్తో ముప్పు లేదు: డీజీపీ
ABN , First Publish Date - 2020-08-15T08:44:18+05:30 IST
అమ్మోనియం నైట్రేట్ వినియోగంలో నిబంధనలు అతిక్రమించిన వారిని ఉపేక్షించవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. బీరుట్లో అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో అప్రమత్తమైన ఏపీ పోలీసుశాఖ...
అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): అమ్మోనియం నైట్రేట్ వినియోగంలో నిబంధనలు అతిక్రమించిన వారిని ఉపేక్షించవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. బీరుట్లో అమ్మోనియం నైట్రేట్ పేలుడుతో అప్రమత్తమైన ఏపీ పోలీసుశాఖ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పోలీస్ బాస్ సముద్ర తీరప్రాంత జిల్లాల ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వినియోగం, జాతీయ, అంతర్జాతీయ రవాణా, ఓడరేవుల్లో తనిఖీలు చేపట్టామని ఆయా జిల్లాల ఎస్పీలు డీజీపీకి వివరించారు. రాష్ట్రంలో అమ్మోనియం నైట్రేట్ వల్ల ఎటువంటి ముప్పులేదని ఈ సందర్భంగా డీజీపీ భరోసా ఇచ్చారు.