అమరావతే శాశ్వతం: లోకేష్

ABN , First Publish Date - 2021-08-08T22:00:48+05:30 IST

పోరాటం చేస్తున్న రైతులదే అంతిమ విజయం.. ఏపీ రాజధాని అమరావతే శాశ్వతమని టీడీపీ నేత నారా లోకేష్‌ స్పష్టం చేశారు.

అమరావతే శాశ్వతం: లోకేష్

అమరావతి: పోరాటం చేస్తున్న రైతులదే అంతిమ విజయం.. ఏపీ రాజధాని అమరావతే శాశ్వతమని టీడీపీ నేత నారా లోకేష్‌ స్పష్టం చేశారు. అమరావతి పేరు వింటేనే సీఎం జగన్ రెడ్డి వణికిపోతున్నారని ఎద్దేవాచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అణచివేతకి ఎదురొడ్డి నిలిచిన.. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం మహోద్యమంగా మారిందని తెలిపారు. జై అమరావతి పోరాటం ప్రారంభించి 600 రోజులైన సందర్భంగా... శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై ఉక్కుపాదం మోపడం సరికాదని దుయ్యబట్టారు. వ్యాన్లలో కుక్కి రాజధాని రైతుల కాళ్లు విరగ్గొట్టారుని, మహిళల పట్ల పోలీసులు విచక్షణ లేకుండా ప్రవర్తించారని నారా లోకేష్‌ తప్పుబట్టారు. ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత ధోరణి ప్రపంచానికి తెలియకుండా... మీడియా ప్రతినిధులపై ఆంక్షాలు పెట్టారని నారా లోకేష్‌ మండిపడ్డారు. 

Updated Date - 2021-08-08T22:00:48+05:30 IST