కొత్తగా 478 కొవిడ్‌ కేసులు.. ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2021-10-23T09:04:36+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 478 మంది కరోనా బారిన పడ్డారు. 24 గంటల్లో 43,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొత్తగా 478 కొవిడ్‌ కేసులు.. ఆరుగురి మృతి

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కొత్తగా 478 మంది కరోనా బారిన పడ్డారు. 24 గంటల్లో 43,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు  వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 119, చిత్తూరులో 96, గుంటూరు 60, కృష్ణా 39 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,62,781 మంది కరోనా బారినపడ్డారు. అందులో 20,43,050 మంది కోలుకున్నారు. శుక్రవారం కొత్తగా మరో 574 మంది కోలుకున్నారు. మరోవైపు 24 గంటల్లో మొత్తం ఆరుగురు కరోనాతో మరణించారు. మొత్తంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,320కి చేరింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 5398 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2021-10-23T09:04:36+05:30 IST