రాజధాని అమరావతిని కొనసాగాలి

ABN , First Publish Date - 2020-07-14T10:02:31+05:30 IST

రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డు పాలు ..

రాజధాని అమరావతిని కొనసాగాలి

209వ రోజుకు చేరిన రైతుల ఆందోళలు


తుళ్లూరు, తాడికొండ, జూలై 13: రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డు పాలు చేసిందని రైతులు మండిపడ్డారు. అమరావతే రాజధానిగా కొనసాగాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 209వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానిలో నిలిపివేసిన పనులు కొనసాగాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజధాని ప్రాంతాన్ని ఒక సామాజికవర్గానికి సంబంఽధించినదిగా ప్రచారం చేయటం విడ్డూరంగా ఉన్నదన్నారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటికైనా రాజధాని అమరావతి నుంచే పరిపాలన కొనసాగించాలని కోరారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-07-14T10:02:31+05:30 IST