నడకకు నీడ దొరక్కుండా..

ABN , First Publish Date - 2021-12-01T08:52:30+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి లో అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచనల మేర కు ఆ పార్టీ..

నడకకు నీడ దొరక్కుండా..

  • సర్వేపల్లిలో యాత్రకు అడ్డంకులు
  • కాకాణి ఆదేశాలతో షెల్టర్‌ ఇవ్వని వైనం! 


నెల్లూరు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల పాదయాత్రకు నెల్లూరు జిల్లా సర్వేపల్లి లో అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచనల మేర కు ఆ పార్టీ నాయకులు రైతులకు ఎక్కడా షెల్టర్‌ దొరకనివ్వకుండా అడ్డుపడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా రైతులు పాదయాత్ర ముగిసిన ప్రదేశం నుంచి బస్సుల్లో వెనుదిరిగి నెల్లూరుకు వచ్చేశారు. మంగళవారం సాయంత్రం పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలానికి చేరుకోవాలి. మరిపూరు ఆశ్రమంలో రైతులు రాత్రి బస చేయాల్సి ఉంది.


అయితే ఏం జరిగిందో ఏమో తమ ఊరి ఆశ్రమంలో రాత్రి బస చేయొద్దని మరిపూరు గ్రామస్థులు పోలీసుల ద్వారా సందేశం పంపినట్లు తెలిసింది. దీనివెనుక కారణాలు గుర్తించిన రైతులు.. గ్రామస్థులను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక బస ప్రదేశాన్ని మార్చుకున్నారు. ఆశ్రమానికి కిలోమీటరు ముందే పాదయాత్రను నిలిపివేసి అక్కడినుంచి బస్సుల్లో వెనక్కు(నెల్లూరు) వచ్చి శనివారం బస చేసిన కల్యాణ మండపానికే చేరుకున్నారు. 

Updated Date - 2021-12-01T08:52:30+05:30 IST