అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రైతు జేఏసీ

ABN , First Publish Date - 2020-02-14T22:37:06+05:30 IST

అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు జేఏసీ స్పష్టం చేసింది. మార్చి మొదటి వారం లేదా మూడో వారంలో ఢిల్లీకి రాజధాని రైతులు వెళ్లనున్నారు.

అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రైతు జేఏసీ

అమరావతి: అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు జేఏసీ స్పష్టం చేసింది. మార్చి మొదటి వారం లేదా మూడో వారంలో ఢిల్లీకి రాజధాని రైతులు వెళ్లనున్నారు. అన్ని పార్టీల నాయకులను కలిసి రైతు జేఏసీ మద్దతు కోరనుంది. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేయాలని చూస్తోందని, పేదలకు భూముల పేరుతో వైసీపీ కార్యకర్తలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, వైసీపీ ప్రభుత్వ చర్యను ప్రతిఘటిస్తామని రైతు జేఏసీ ప్రకటించింది.

Updated Date - 2020-02-14T22:37:06+05:30 IST