ఏడవ రోజు Amravati రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-07T12:52:50+05:30 IST

రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఏడవ రోజు కొనసాగుతోంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో

ఏడవ రోజు Amravati రైతుల మహాపాదయాత్ర

అమరావతి: రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఏడవ రోజు కొనసాగుతోంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో స్వల్ప మార్పులు జరిగాయి. పర్చూరులో బయల్దేరి మధ్యాహ్నం భోజనానికి నూతలపాడుకు, రాత్రికి దగ్గుబాడు చేరుకుని బస చేసేలా ముందుగా ప్రాణాళికను సిద్ధం చేశారు. అయితే.. షెడ్యూల్ ప్రకారం పర్చూరు నుండి యాత్ర ప్రారంభమై భోజన సమయానికి వంకాయలపాడుకు చేరుకుని అనంతరం ఇంకొల్లుకు యాత్ర బృందం వెళ్తుంది. అనంతరం సోమవారం పాదయాత్రకు అమరావతి రైతులు విరామం తీసుకోనున్నారు. శనివారం పోలీసులు రాజధాని రైతులకు నోటీసులు ఇచ్చారు. ప్రచార వాహనం సీజ్ చేశారు. దీంతో పాదయాత్రలో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగించి తీరుతామని రాజధాని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-07T12:52:50+05:30 IST