రానున్న రెండు రోజుల్లో ఏపీకి భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2021-06-17T13:10:38+05:30 IST

పశ్చిమ, నైరుతి దిశల నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా బలమైన గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర తీరప్రాంతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు గురువారం సముద్రంలో

రానున్న రెండు రోజుల్లో ఏపీకి భారీ వర్షసూచన

అమరావతి/విశాఖపట్నం: పశ్చిమ, నైరుతి దిశల నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా బలమైన గాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర తీరప్రాంతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు గురువారం సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. బుధవారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. రెండు రోజుల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులుగా ఏపీలో ఒరుపు వాతావరణం నెలకొంది. కాగా దక్షిణాదిలో వేగంగా విస్తరించి.. దేశంలో ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల కదలికలో మందగమనం ఏర్పడింది. పశ్చిమ, నైరుతి గాలుల కారణంగా నిదానంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2021-06-17T13:10:38+05:30 IST