సజావుగా రెండో రోజు ఎంసెట్‌

ABN , First Publish Date - 2020-09-19T09:13:41+05:30 IST

షీలానగర్‌ అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో ఎంసెట్‌ రెండవ రోజు పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా నిర్వహించారు. రెండు సెషన్‌లలో 1120 మంది విద్యార్థులు

సజావుగా రెండో రోజు ఎంసెట్‌

షీలానగర్‌లో 1120 మంది, చినముషిడివాడలో 1550 మంది హాజరు



అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబరు 18: షీలానగర్‌ అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో ఎంసెట్‌  రెండవ రోజు పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా నిర్వహించారు.  రెండు సెషన్‌లలో  1120 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల చేతులకు శానిటైజేషన్‌, థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి సిబ్బంది పరీక్షా కేంద్రంలోకి పంపారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించి కూర్చునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.


చినముషిడివాడలో..

పెందుర్తి: చినముషిడివాడ అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో ఎంసెట్‌  రెండోరోజు పరీక్ష సజావుగా జరిగింది. ఉదయం 830 మంది, మధ్యాహ్నం 720  మంది మొత్తంగా 1550 మంది హాజరయ్యారని నిర్వాహకులు  తెలిపారు.

Updated Date - 2020-09-19T09:13:41+05:30 IST