విద్యుత్‌ చార్జీల పెంపు తగదు

ABN , First Publish Date - 2021-09-14T05:18:45+05:30 IST

సర్దుబాటు పేరుతో పెంచిన విద్యుత్‌ చార్జీల (ట్రూఅప్‌)ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌ చార్జీల పెంపు తగదు
దాసన్నపేట విద్యుత్‌ భవనం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు

  జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతల నిరసన

  ప్రభుత్వ వైఖరిపై మండిపాటు

సర్దుబాటు పేరుతో పెంచిన విద్యుత్‌ చార్జీల (ట్రూఅప్‌)ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.  ఈమేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపడం తగదన్నారు.  ఒకవైపు కరోనా, మరోవైపు పెరిగిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలతో  సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని తెలిపారు. ఇటువంటి సమయంలో  విద్యుత్‌ చార్జీలు పెంచడంతో భావ్యం కాదన్నారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యుత్‌ శాఖాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. 

- (ఆంధ్రజ్యోతి బృందం)

 

Updated Date - 2021-09-14T05:18:45+05:30 IST