చెరువులో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-02-25T05:15:18+05:30 IST
ఎస్.కోట శివారు సీతంపేట గ్రామ సమీ పంలోని చెరువులోపడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతిచెందాడు
శృంగవరపుకోట, ఫిబ్రవరి 24: ఎస్.కోట శివారు సీతంపేట గ్రామ సమీ పంలోని చెరువులోపడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతిచెందాడు. బుధవారం ఈ విషయంపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. గత కొంతకాలంగా ఈ గ్రామంలో మతిస్థిమితం లేని వ్యక్తి సంచరిస్తున్నాడని, ఈ క్రమంలో బుధవారం సాయంత్రం గ్రామసమీపంలోని చెరువులో ఆయన మృతదేహంగా తేలాడని తెలి పారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి ఎస్.కోట ప్రభు త్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నామని పోలీసులు తెలిపారు.