రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. పోలీసుల విచారణలో బయటపడిన మేనకోడలి యవ్వారం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-10-22T22:15:00+05:30 IST

ఉత్తరప్రదేశ్ బండా జిల్లాలోని అతర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఉషకు, కృష్ణ నగర్‌కు చెందిన ఓంప్రకాష్‌తో పరిచయం ఏర్పడింది. రాను రాను వీరి పరిచయం.. ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. ఇలావుండగా ఓ రోజు

రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. పోలీసుల విచారణలో బయటపడిన మేనకోడలి యవ్వారం.. అసలేం జరిగిందంటే..

మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. తాము అనుకున్నది జరకగపోతే.. తల్లిదండ్రులు, సొంత వాళ్లు అని కూడా చూడకుండా ఎంతకైనా తెగించడానికి కొందరు వెనకాడరు. ఉత్తరప్రదేశ్‌లో ఈ నెల 13వ తేదీన రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడం.. సంచలనం కలిగించింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి. ఈ హత్యతో మేనకోడలికి సంబంధం ఉందని పోలీసు విచారణలో తేలింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ బండా జిల్లాలోని అతర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఉషకు, కృష్ణ నగర్‌కు చెందిన ఓంప్రకాష్‌తో పరిచయం ఏర్పడింది. రాను రాను వీరి పరిచయం.. ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ రోజూ కలుసుకునేవారు. ఇలావుండగా ఓ రోజు వీరిద్దరూ.. ఉష మేనమామ రామఖేలావన్ కంటపడ్డారు. వారిని చూసిన రామఖేలావన్.. కోపంతో మందలించాడు. విషయం ఇంట్లో చెబుతానని హెచ్చరించాడు. దీంతో భయపడ్డ ప్రేమికులు.. రామఖేలవన్‌పై కోపం పెంచుకున్నారు. అతను బతికుంటే తమ ప్రేమకు అడ్డుగా ఉంటాడనే కారణంతో చంపేయాలని నిర్ణయించుకున్నారు.


అదును కోసం వేచి చూస్తున్న వారు.. ఈ నెల 13న రాత్రి రామఖేలావన్ ఇంటికి చేరుకున్నారు. అప్పటికి రామఖేలవన్ నిద్రపోతున్నాడు. ఇదే అవకాశంగా భావించిన వారు.. ఇటుకలు, బండరాళ్లతో తలపై విచక్షణారహితంగా మోది హత్య చేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక, మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మేనకోడలిపై అనుమానం రావడంతో శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ప్రేమికులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి తుపాకి, సెల్‌ఫోన్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-10-22T22:15:00+05:30 IST