ఆ విషయం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: అనగాని

ABN , First Publish Date - 2020-06-01T23:42:43+05:30 IST

పార్టీ మార్పుపై ప్రచారాన్ని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఖండించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇలాంటి పుకార్లు మూడోసారని, చంద్రబాబు...

ఆ విషయం నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా: అనగాని

అమరావతి: పార్టీ మార్పుపై ప్రచారాన్ని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఖండించారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇలాంటి పుకార్లు మూడోసారని, చంద్రబాబు చేసే ప్రతి పోరాటంలో అండగా ఉంటున్నానని పేర్కొన్నారు. కొందరు కుట్రతో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సింది పార్టీనేనన్నారు. పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చే మహానాడుకు వెళ్లలేదన్నారు. బాలినేనిని కలిశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. 


టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమైన విషయం తెలిసిందే. సీఎం జగన్‌ సమక్షంలో పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీ కండువా కప్పుకోనున్నారని వార్తలు వెలువడ్డాయి. వీరితో రాష్ట్ర మంత్రి బాలినేని, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి‌ మంతనాలు జరిపారని.. పార్టీలో చేరడమే తరువాయి అన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆ వార్తలను సాంబశివరావు తొలుత ఖండించగా, ప్రస్తుతం అనగాని కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము పార్టీలోనే ఉంటున్నామని... పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు.  

Updated Date - 2020-06-01T23:42:43+05:30 IST