మా ట్రాక్టర్తో మాత్రం జర భద్రం: ఆనంద్ మహీంద్రా ట్వీట్
ABN , First Publish Date - 2021-12-12T19:46:34+05:30 IST
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్వీట్టర్లో యాక్టివ్గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆదివారం ఒక ఫన్నీ ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్వీట్టర్లో యాక్టివ్గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆదివారం ఒక ఫన్నీ ట్వీట్ చేశారు. ఒక పెద్ద ట్రాక్టర్ను తన బొమ్మ ట్రాక్టరుకి తాడుకట్టి లాగుతున్న బుడతడి వీడియో షేర్ చేస్తూ.. ‘‘మీ పిల్లాడిలో ఆత్మవిశ్వాసం నింపడానికి కచ్చితంగా ఇదొక గొప్ప పద్ధతి. కానీ, ఇటువంటిదే మీరు మహేంద్రా ట్రాక్టరుతో ప్రయత్నంచాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో తండ్రిలా బహుజాగ్రత్త తీసుకోవల్సిందే’’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
పెద్ద ట్రాక్టరుని తానే లాగుతున్న నమ్మకాన్ని ఆ చిన్నారిలో కలిగించడాన్ని మెచ్చుకుంటూనే, పనిలో పనిగా తమ మహీంద్రా ట్రాక్టర్స్ ప్రస్తావన తెచ్చారు ఆనంద్ మహేంద్రా. కరోనా కారణంగా వివిధ రంగాల్లో వృద్ధి రేటు మైనస్లలో ఉన్నప్పటికీ, వ్యవసాయ వృద్ధి మాత్రం ఆశాజనకంగా ఉండి, వ్యవసాయ రంగానికి సంబంధించిన ట్రాక్టర్ వంటి ఫామ్ ఎక్విప్మెంట్ అమ్మకాలు పెరిగాయి. ఆ నేపథ్యంలో మహీంద్రా ట్రాక్టర్స్ మంచి అమ్మకాలనే సాధించింది. ఈ ట్వీట్ నెపంతో దాన్ని కూడా ఆనంద్ మహీంద్రా పరోక్షంగా పేర్కోనడం విశేషం.