‘దళితులపై దాడులు మానకపోతే ఊరుకోం’

ABN , First Publish Date - 2020-07-17T11:34:49+05:30 IST

రాష్ట్రంలో దళితులపై దాడులు మానుకోకపోతే దళితవర్గాలు చూస్తూ ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హెచ్చరించారు.

‘దళితులపై దాడులు మానకపోతే ఊరుకోం’

అమలాపురం టౌన్‌, జూలై 16: రాష్ట్రంలో దళితులపై దాడులు మానుకోకపోతే దళితవర్గాలు చూస్తూ ఊరుకోరని మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హెచ్చరించారు. అమలాపురం టీడీపీ కార్యాలయంవద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ మొదలుకుని డాక్టర్‌ అనిత, మహాసేన అధ్యక్షుడు రాజేష్‌, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌లపై కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. చిత్తూరు జిల్లాలో దళిత న్యాయమూర్తిపైనే వైసీపీ సానుభూతిపరులు దాడి చేయడం, వారికి మంత్రి పెద్దిరెడ్డి అండగా ఉండడం దారుణమని అన్నారు. రాజగృహపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-17T11:34:49+05:30 IST