‘వైవీ సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేసి స్వీట్ షాపు పెట్టుకోవాలి’
ABN , First Publish Date - 2020-05-27T22:25:09+05:30 IST
అమరావతి: వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి.. స్వీట్ షాపు పెట్టుకోవాలని టీడీపీ నేత వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు.
అమరావతి: వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి.. స్వీట్ షాపు పెట్టుకోవాలని టీడీపీ నేత వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు. ఆచారాలు తెలియని సుబ్బారెడ్డికి చైర్మన్గా ఉండే అర్హత లేదన్నారు. సీఎం జగన్.. తిరుమలను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి ఆస్తులు కాజేయాలని చూస్తే హిందువులు చూస్తూ ఊరుకోరన్నారు. మంత్రి వెల్లంపల్లికి అర్చకుడికి, పురోహితునికి తేడా తెలీదన్నారు. త్వరలో జగన్ ప్రభుత్వం కూలిపోక తప్పదు ఆనంద్ సూర్య పేర్కొన్నారు.