రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు
ABN , First Publish Date - 2021-01-26T06:02:52+05:30 IST
: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గుంటూరు, జనవరి 25(ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఒక వ్యవస్థ పనితీరులో మరో వ్యవస్థ తలదూర్చటం సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేలా ఉందన్నారు. రాజ్యంగేతర శుక్తుల్లా వ్యవహరించాలనుకునే వారికి ఈ తీర్పు చెంపపెట్టని అభివర్ణించారు. ఇప్పటికైనా ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు తప్పనిసరి అని... స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.