విష్ణు దాతృత్వంతో ఆనందయ్య మందు పంపిణీ

ABN , First Publish Date - 2021-06-22T02:47:11+05:30 IST

ర్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణు వర్థన్‌రెడ్డి దాతృత్వంతో సోమవారం ఆనందయ్య మందును

విష్ణు దాతృత్వంతో ఆనందయ్య మందు పంపిణీ
ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు

కావలి, జూన్‌21: స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణు వర్థన్‌రెడ్డి దాతృత్వంతో సోమవారం ఆనందయ్య మందును టీడీపీ నేతలు పంపిణీ చేశారు. కరోనా వచ్చిన వారు ఆనందయ్య మందుకోసం పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని చలించిన  విష్ణువర్థన్‌రెడ్డి కృష్ణపట్నం  ఆనందయ్య వద్ద నుంచి మందు తెప్పించి కావలిలో  పంపిణీ చేశారు. అలాగే కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా వేసుకునే ఆనందయ్య మందును కూడా తెప్పించి టీడీపీ నాయకుల ద్వారా పట్టణంలోని ఆయా వార్డులలో ఇంటింటికి పంపిణీచేసే ఏర్పాట్లు చేపట్టారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతిబాబూరావు, సీహెచ్‌. మాల్యాద్రి, అక్కిలగుంట సూరి, హరిబాబు, గొట్టిపాటి రాము, అప్పల కల్యాణ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-22T02:47:11+05:30 IST