వైసీపీ రెబల్ సర్పంచ్.. ఆనందయ్య మందు పంపిణీ
ABN , First Publish Date - 2021-06-17T13:24:56+05:30 IST
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో..
అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు
తిరుపతి: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ వైసీపీ రెబల్ సర్పంచ్ బుధవారం తన పంచాయతీ పరిధిలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పుదిపట్ల పంచాయితీ సర్పంచ్ బడి సుధాయాదవ్ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. దీంతో ఆయన చెవిరెడ్డిని ఎదిరించి ఇండిపెండెంట్గా గెలుపొందారు. ఈ క్రమంలో చెవిరెడ్డి.. ఆనందయ్య శిష్యుల నేతృత్వంలో తయారు చేసిన కరోనా నివారణ మందు పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే సుధాయాదవ్ నేరుగా ఆనందయ్య దగ్గర నుంచే మందు తీసుకొచ్చి తన గ్రామంలో పంచడం మొదలుపెట్టారు. ప్రభుత్వ అనుమతి లేకుండా పంపిణీ చేస్తున్నారంటూ పోలీసులు అడ్డుకున్నారు. కానీ.. తన గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఆనందయ్య మందుని పంచి తీరుతానని సుధాయాదవ్ పట్టుదలగా ఉండడంతో వాతావరణం వేడెక్కింది.