AP: అనంతపురంలో దారుణం
ABN , First Publish Date - 2021-08-13T19:19:39+05:30 IST
జిల్లాలోని ధర్మవరం పట్టణం కొత్తపేటలో దారుణం జరిగింది.
అనంతపురం: జిల్లాలోని ధర్మవరం పట్టణం కొత్తపేటలో దారుణం జరిగింది. మూడు సంవత్సరాల కూతురు ప్రణీతను కన్న తల్లి మీనాక్షి కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.