Anantapurలో వాలంటీర్ ఘరానా మోసం

ABN , First Publish Date - 2021-08-15T13:27:28+05:30 IST

జిల్లాలోని అమరాపురం మండలం హోసట్టి గ్రామ వాలంటీర్ శివకుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు.

Anantapurలో వాలంటీర్ ఘరానా మోసం

అనంతపురం: జిల్లాలోని అమరాపురం మండలం హోసట్టి గ్రామ వాలంటీర్ శివకుమార్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. గౌరమ్మ అనే మహిళ ఖాతా నుంచి రూ.10,000 నగదును వాలంటీర్ తన ఖాతాలోకి మార్చుకున్నాడు. గతంలోనూ గ్రామానికి చెందిన పలువురు మహిళలు అకౌంట్లో నుంచి డబ్బును వాలంటీర్ తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్ మోసంపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2021-08-15T13:27:28+05:30 IST