ఏపీలో నడిచేది అసమర్థ, దోపిడి దొంగల పాలన: వెంకట ప్రసాద్

ABN , First Publish Date - 2021-09-02T16:19:20+05:30 IST

రాష్ట్రంలో అసమర్థ, దోపిడి దొంగల పాలన కొనసాగుతుందని...అందుకు నిదర్శనమే కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఏపీలో నడిచేది అసమర్థ, దోపిడి దొంగల పాలన: వెంకట ప్రసాద్

అనంతపురం: రాష్ట్రంలో అసమర్థ, దోపిడి దొంగల పాలన కొనసాగుతుందని...అందుకు నిదర్శనమే కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి అని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఒకటో తేదీ పింఛన్లు వస్తాయా లేదా అనే భయంతో బతుకుతున్నారన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పినట్లు చేయకపోవడంతోనే టౌన్ ప్లానింగ్ అధికారిని కౌన్సిల్ సమావేశంలో బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు నిదర్శనమే తలుపుల ఎంపీడీవో ఘటన అని వెంకట ప్రసాద్ అన్నారు. 

Updated Date - 2021-09-02T16:19:20+05:30 IST