అనంతపురం: దళిత మహిళపై దాడి కేసులో ఆర్డీవో విచారణ

ABN , First Publish Date - 2020-06-01T19:01:59+05:30 IST

అనంతపురం: దళిత మహిళపై దాడి కేసులో ఆర్డీవో విచారణ

అనంతపురం: దళిత మహిళపై దాడి కేసులో ఆర్డీవో విచారణ

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనఉప్పలపాడు ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. గత నెల 15న కోనఉప్పలపాడు గ్రామంలో దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన శంకరరెడ్డి దాడి చేశాడు. విషయం తెలిసిన అనంతపురం ఆర్డీవో గుణభూషన్ రెడ్డి, డీఎస్సీ శ్రీనివాసులు, సోషియల్ వెల్పేర్ డీడీవో విశ్వ మోహన్ రెడ్డి గ్రామానికి వెళ్లి జరిగిన దాడిపై బాధితులను విచారించారు. దీంతో బాధిత మహిళ తనకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో గుణభూషన్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్నారు. ఎవ్వరికి భయపడవద్దని... న్యాయం చేస్తామంటూ బాధితులకు అధికారులు హామీ ఇచ్చారు.  

Updated Date - 2020-06-01T19:01:59+05:30 IST