Anantapuram: చెరువులో పడిన ముగ్గురు విద్యార్థులు మృతి

ABN , First Publish Date - 2021-10-12T15:06:40+05:30 IST

అమడగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మలకవారిపల్లి తండాలో చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ

Anantapuram: చెరువులో పడిన ముగ్గురు విద్యార్థులు మృతి

అనంతపురం: అమడగూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం మలకవారిపల్లి తండాలో చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.గజ ఈతగాళ్లు ఎంత గాలించిన విద్యార్థుల ఆచూకీ లభించలేదు. ఎట్టకేలకు..మంగళవారం ఉదయం గల్లంతైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ దొరికింది. మృతులు లాలూ ప్రసాద్ నాయక్, పురుషోత్తం నాయక్, హేమంత్ నాయక్‌గా పోలీసులు గుర్తించారు. ముగ్గురు విద్యార్థుల మృతితో ఆ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-10-12T15:06:40+05:30 IST