తాడిపత్రి డీఎస్పీని ఉద్దేశించి ఎస్సై సుధాకర్ లేఖ...సోషల్ మీడియాలో వైరల్

ABN , First Publish Date - 2021-09-29T17:42:08+05:30 IST

తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము వ్యవహిరంచి తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాడిపత్రి డీఎస్పీని ఉద్దేశించి ఎస్సై సుధాకర్ లేఖ...సోషల్ మీడియాలో వైరల్

అనంతపురం: తాడిపత్రి డీఎస్పీ చైతన్య, గుత్తి సీఐ రాము వ్యవహిరంచి తీరును ప్రస్తావిస్తూ ఎస్సై సుధాకర్ యాదవ్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుత్తి ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న రెండు మూడు రోజుల్లోనే సిక్ చేస్తావా... హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలంటూ డీఎస్పీ చైతన్య ఫోన్‌లో బెదిరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తి సీఐ లక్షల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నా... ఆయనకే వంత పాడుతున్నారన్నారు. ఇలాంటి అడ్డమైన దారులు తొక్కే వారి మాటలు విని అందర్నీ ఇబ్బంది పెడుతూపోతే వ్యవస్థ నాశనం అవుతుందని చెప్పారు. ఉన్నతాధికారులు నిజాయితీగా పనిచేసేవారిని ప్రోత్సహించాలన్నారు. యూనిఫాం తాకట్టు పెట్టి డబ్బులు వసూలు చేసే వారిని సపోర్ట్ చేస్తే తమ కుటుంబాలకు సమాజానికి పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. హోం గార్డ్‌గా కూడా పనికి రాని గుత్తి సీఐ రామును తమ కులానికి చెందినవారని సపోర్ట్ చేయడం నేరం సార్ అని అన్నారు. ‘‘నన్ను సస్పెండ్ చేసినా... నేను కట్టిన 36 కేసులకు 36 ఛార్జ్ మెమోలు ఇచ్చినా గర్వంగానే ఉంటాను’’ అంటూ తాడిపత్రి డిఎస్పీ చైతన్యనుద్దేశించి ఎస్సై సుధాకర్ యాదవ్ లేఖ రాశారు. 

Updated Date - 2021-09-29T17:42:08+05:30 IST