Anantapur: దాయాదుల మధ్య ఆస్తి గొడవ
ABN , First Publish Date - 2021-12-14T15:53:12+05:30 IST
జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో ఆస్తి తగాదా విషయంలో దాయాదుల మధ్య గొడవ చోటు చేసుకుంది.
అనంతపురం: జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో ఆస్తి తగాదా విషయంలో దాయాదుల మధ్య గొడవ చోటు చేసుకుంది. వేటూరి కుమారస్వామి అనే వ్యక్తి పొలంలో పని చేస్తుండగా అన్నదమ్ములైన ఏటూరి రాజు, ఏటూరి మహేష్లు కర్రలతో దాడి చేశారు. అపస్మారక స్థితిలో పడివున్న కుమారస్వామిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.