అనంతపురం జిల్లా: రైతు ఆడియో కలకలం...
ABN , First Publish Date - 2021-07-29T21:41:29+05:30 IST
అనంతపురం: జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన వైరల్గా మారింది. విద్యుత్ సరఫరా సరిగా లేదంటూ...
అనంతపురం: జిల్లాకు చెందిన ఓ రైతు ఆవేదన వైరల్గా మారింది. విద్యుత్ సరఫరా సరిగా లేదంటూ రైతు సిద్ధారెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. పంటలు ఎండిపోతున్నాయంటూ రైతు లైన్ మెన్కు ఫోన్ చేశాడు. అయితే విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో తానేమి చేయలేనంటూ చెప్పాడు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పట్టించుకోవడంలేదని రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే గత ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ సరఫరా సరిగా ఉండేదని రైతు సిద్దారెడ్డి అన్నాడు. ఇప్పుడు ఆ ఆడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.