అనంతపురం: రైతు ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-04-16T21:17:55+05:30 IST
తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన
అనంతపురం: తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరుతూ ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలోని లేపాక్షి తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి అనే రైతు పట్టాదారు పాసు పుస్తకాల కోసం గత కొంతకాలంగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే పాసు పుస్తకాలను అధికారులు మంజూరు చేయలేదు. దీంతో కార్యాలయంలో రైతు సుధాకర్ రెడ్డి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. కార్యాలయ సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకున్నారు.