కియా పరిశ్రమ వద్ద టెన్షన్ పెట్టిన దక్షిణ కొరియన్లు

ABN , First Publish Date - 2020-03-26T18:37:32+05:30 IST

పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ వద్ద దక్షిణ కొరియన్లు కలకలం సృష్టించారు. క్వారెంటైన్‌లో ఉన్న

కియా పరిశ్రమ వద్ద టెన్షన్ పెట్టిన దక్షిణ కొరియన్లు

అనంతపురం: పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ వద్ద దక్షిణ కొరియన్లు కలకలం సృష్టించారు. క్వారెంటైన్‌లో ఉన్న ముగ్గురు సౌత్ కొరియా వసూలు రోడ్డు పైకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 28 రోజులు క్వారంటై‌న్ పూర్తికావడంతో తాము వెళతామని కొరియన్లు వాదనకు దిగడంతో పోలీసులు తీవ్రంగా ప్రతిఘటించారు. బయటికి వెళ్లడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. వారి నుంచి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే సమాచారాన్ని పెనుకొండ డీఎస్పీ మహబూబ్ బాషాకి చేరవేయడంతో ఆయన కియా వద్దకు చేరుకున్నారు. కియా అధికారులతో ఆయన చర్చించారు. ఇదిలా ఉంటే.. కియా కంపెనీలో 54 మంది క్వారెంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2020-03-26T18:37:32+05:30 IST