Anantapur: యాడికిలో పందుల పెంపకందార్ల వీరంగం
ABN , First Publish Date - 2021-09-17T15:46:15+05:30 IST
జిల్లాలోని యాడికిలో పందుల పెంపకందార్లు పెట్రోల్ బాటిల్తో వీరంగం సృష్టించారు.
అనంతపురం: జిల్లాలోని యాడికిలో పందుల పెంపకందార్లు పెట్రోల్ బాటిల్తో వీరంగం సృష్టించారు. పందులు విచ్చలవిడిగా తిరుగుతూ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయంటూ యాడికి ఉప సర్పంచ్, సర్పంచ్ భర్త పందులను తలిస్తున్నారు. అయితే ఉప సర్పంచ్ను, సర్పంచ్ భర్తను అడ్డుకొన్న పెంపకందార్లు వారితో వాగ్వాదానికి దిగారు. మాట మాట పెరిగి ఉప సర్పంచ్, సర్పంచ్ భర్తపై పందుల పెంపకందార్లు పెట్రోల్ పోసి హత్యాయత్నంకు ప్రయత్నించారు. ఈ ఘటనపై బాధితులు యాడికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.