AP: పెన్నమ్మ పరవళ్లు

ABN , First Publish Date - 2021-11-28T12:55:36+05:30 IST

పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. ఎంపీఆర్‌ డ్యామ్‌ మూడు గేట్లను ఎత్తి నది దిగువకు నీటిని విడుదల చేశారు. నీరు శనివారం పామిడికి చేరింది. పెన్నా జలకళను చూసేందుకు

AP: పెన్నమ్మ పరవళ్లు

అనంతపురం: పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. ఎంపీఆర్‌ డ్యామ్‌ మూడు గేట్లను ఎత్తి నది దిగువకు నీటిని విడుదల చేశారు. నీరు శనివారం పామిడికి చేరింది. పెన్నా జలకళను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్నో ఏళ్లుగా బోసి పోయిన పెన్నానది నీటి ప్రవాహంతో ఉరకలేస్తోంది. నది వద్దకు జనం వెళ్లకుండా సీఐ ఈరన్న, ఎస్‌ఐ చాంద్‌బాషా తగిన చర్యలు తీసుకున్నారు.

పెన్నానదిలో నీటి ఉధృతి పెరగడంతో  ప్రజలు ఎవరూ వెళ్లరాదని పట్టణ సీఐ కృష్ణారెడ్డి శ నివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీరు పోటెత్త డంతో పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయ ర్‌ గేట్లు ఎత్తి పెన్నానదికి మళ్లించారు. దీంతో నీటి ప్ర వాహం పెరిగిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎ ద్దుల బండ్ల నిర్వాహకులు ఇసుక కోసం నదిలోకి దిగరాదని ఆయన సూచించారు. 

Updated Date - 2021-11-28T12:55:36+05:30 IST